<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	xmlns:media="http://search.yahoo.com/mrss/" >

<channel>
	<title>vgnews.net</title>
	<atom:link href="https://vgnews.net/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vgnews.net</link>
	<description></description>
	<lastBuildDate>Wed, 19 Aug 2026 20:38:21 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=7.0.4</generator>

<image>
	<url>https://vgnews.net/wp-content/uploads/2025/02/vg-news-fevicon.png</url>
	<title>vgnews.net</title>
	<link>https://vgnews.net</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>ఆన్‌లైన్ నుంచి 22-A ఆంక్షలను వెంటనే తొలగించాలి: హరీష్ రావు</title>
		<link>https://vgnews.net/brs-leader-harish-rao-demanded-that-the-government-immediately-remove-the-22-a-restrictions-from-the-online-system/</link>
		
		<dc:creator><![CDATA[VG News]]></dc:creator>
		<pubDate>Wed, 19 Aug 2026 20:38:21 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#22-AIssue]]></category>
		<category><![CDATA[#22-ALandIssue]]></category>
		<category><![CDATA[#22/A]]></category>
		<category><![CDATA[#22AProperties]]></category>
		<category><![CDATA[#BRS]]></category>
		<category><![CDATA[#Harishrao]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#PoliticalNews]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TelanganaBhavan]]></category>
		<category><![CDATA[#TelanganaBhavanNews]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=2302</guid>

					<description><![CDATA[<p>VGన్యూస్: 22-A పేరుతో ఇబ్బందులు పడుతున్న బాధితులెవరూ ఆందోళన చెందవద్దు అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత హరీష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో 22-A నిషేధిత భూముల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. హూడా, హెచ్‌ఎమ్‌డీఏ అప్రూవ్‌డ్ లేఅవుట్లలో, 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ఇళ్లను కూడా ఇప్పుడు 22-A లో పెట్టారంటే.. దీని వెనుక ఎంత [&#8230;]</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/brs-leader-harish-rao-demanded-that-the-government-immediately-remove-the-22-a-restrictions-from-the-online-system/">ఆన్‌లైన్ నుంచి 22-A ఆంక్షలను వెంటనే తొలగించాలి: హరీష్ రావు</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: 22-A పేరుతో ఇబ్బందులు పడుతున్న బాధితులెవరూ ఆందోళన చెందవద్దు అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత హరీష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో 22-A నిషేధిత భూముల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. హూడా, హెచ్‌ఎమ్‌డీఏ అప్రూవ్‌డ్ లేఅవుట్లలో, 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ఇళ్లను కూడా ఇప్పుడు 22-A లో పెట్టారంటే.. దీని వెనుక ఎంత పెద్ద కమీషన్ల దందా నడుస్తోందో అర్థమవుతోందన్నారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను 22-Aలో పెట్టారని నాలుగు నెలల క్రితమే స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి చెప్పినా రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 రోజుల క్రితమేమో ఒక్క ఎకరం కూడా 22-A లో పెట్టలేదు అన్నారు.. నిన్ననేమో అధికారులు పొరపాటు చేశారు సారీ అంటున్నారు.. ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిన్న చిన్న విషయాలకే సీఐడీ, విజిలెన్స్ విచారణలు వేసే సీఎం రేవంత్ రెడ్డి.. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న ఈ 22-A కుంభకోణంపై సీఐడీ ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ దందాతో సంబంధం లేకపోతే.. తక్షణమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.                                                        22-A బాధితులకు అన్ని రకాలుగా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ భవన్‌లో 10 మంది న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. లీగల్ సెల్ సపోర్ట్‌తో పాటు ఎమ్మెల్యేలుగా తాము కూడా అధికారులతో, కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యే వరకు మీ వెంటే ఉంటామని భరోసా కల్పించారు. ఎవ్వరూ భయపడి తక్కువ ధరలకు ఆస్తులు అమ్ముకోవద్దని సూచించారు. ఎంతటి పోరాటానికైనా సిద్ధపడి మీ ఆస్తులను రక్షించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని తెలిపారు. ప్రజలను మీసేవలు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పకుండా.. ప్రభుత్వం చేసిన తప్పును ప్రభుత్వమే సుమోటోగా స్వీకరించి ఆన్‌లైన్ నుంచి 22-A ఆంక్షలను వెంటనే తొలగించాలన్నారు. ఒకటి రెండు రోజులు చూస్తాం.. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం ఇల్లు ముట్టడికి సిద్ధమవుతామని హరీష్ రావు హెచ్చరించారు.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/brs-leader-harish-rao-demanded-that-the-government-immediately-remove-the-22-a-restrictions-from-the-online-system/">ఆన్‌లైన్ నుంచి 22-A ఆంక్షలను వెంటనే తొలగించాలి: హరీష్ రావు</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>&#8216;నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి&#8217;</title>
		<link>https://vgnews.net/quality-standards-must-be-strictly-adhered-to-in-construction-works/</link>
		
		<dc:creator><![CDATA[VG News]]></dc:creator>
		<pubDate>Wed, 19 Aug 2026 20:00:35 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[విద్య-ఉద్యోగం]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#Achampet]]></category>
		<category><![CDATA[#DrCharakondaVenkatesh]]></category>
		<category><![CDATA[#EducationForAll]]></category>
		<category><![CDATA[#EducationReforms]]></category>
		<category><![CDATA[#GovernmentSchools]]></category>
		<category><![CDATA[#QualityEducation]]></category>
		<category><![CDATA[#SchoolDevelopment]]></category>
		<category><![CDATA[#SchoolInspection]]></category>
		<category><![CDATA[#SMC]]></category>
		<category><![CDATA[#StudentFirst]]></category>
		<category><![CDATA[#StudentWelfare]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TelanganaDevelopment]]></category>
		<category><![CDATA[#TelanganaEducationCommission]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TelanganaPublicSchool]]></category>
		<category><![CDATA[#TelanganaPublicSchool(TPS)]]></category>
		<category><![CDATA[#TelanganaPublicSchools]]></category>
		<category><![CDATA[#TelanganaPublicSchools(TPS)]]></category>
		<category><![CDATA[#TelanganaRising2047]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<category><![CDATA[#TPS]]></category>
		<category><![CDATA[#Vangoor]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=2299</guid>

					<description><![CDATA[<p>VGన్యూస్: అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూర్ మండలంలో బుధవారం తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్ పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే వంగూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులను [&#8230;]</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/quality-standards-must-be-strictly-adhered-to-in-construction-works/">&#8216;నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి&#8217;</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూర్ మండలంలో బుధవారం తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్ పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే వంగూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా చారకొండ వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. ప్రతి పనిని పూర్తి బాధ్యతతో చేపట్టాలన్నారు.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/quality-standards-must-be-strictly-adhered-to-in-construction-works/">&#8216;నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి&#8217;</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>22/ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం: మంత్రి పొంగులేటి</title>
		<link>https://vgnews.net/fast-track-solution-for-22-a-issue-minister-ponguleti/</link>
		
		<dc:creator><![CDATA[VG News]]></dc:creator>
		<pubDate>Wed, 19 Aug 2026 19:41:18 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#22-AIssue]]></category>
		<category><![CDATA[#22-ALandIssue]]></category>
		<category><![CDATA[#22/A]]></category>
		<category><![CDATA[#Fast-trackSolution]]></category>
		<category><![CDATA[#Fast-trackSolutionFor22-AIssue]]></category>
		<category><![CDATA[#IndianRegistrationAct]]></category>
		<category><![CDATA[#IndianRegistrationAct1908]]></category>
		<category><![CDATA[#Land]]></category>
		<category><![CDATA[#LandIssue]]></category>
		<category><![CDATA[#LandRegistration]]></category>
		<category><![CDATA[#LandRegistrationIssue]]></category>
		<category><![CDATA[#MinisterPonguletiSrinivasaReddy]]></category>
		<category><![CDATA[#PonguletiSrinivasaReddy]]></category>
		<category><![CDATA[#PrajaPalana]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#Teleconference]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=2297</guid>

					<description><![CDATA[<p>VGన్యూస్: 22/ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22/A జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న [&#8230;]</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/fast-track-solution-for-22-a-issue-minister-ponguleti/">22/ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం: మంత్రి పొంగులేటి</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: 22/ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22/A జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.<br />
బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.22/ఎ జాబితాలో భూమి ఉందనే కారణంతో మాత్రమే రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం లేదా తిరస్కరించడం చేయవద్దని ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాల‌ని ఆదేశించారు. సంబంధిత భూమి 22/ఎ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటి? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.<br />
రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22/ఎభూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను కూడా పరిరక్షిస్తూ, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/fast-track-solution-for-22-a-issue-minister-ponguleti/">22/ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం: మంత్రి పొంగులేటి</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దాలి: డా. గోపి</title>
		<link>https://vgnews.net/dr-gopi-said-that-farmers-should-be-transformed-into-electricity-producers/</link>
		
		<dc:creator><![CDATA[VG News]]></dc:creator>
		<pubDate>Wed, 19 Aug 2026 19:23:11 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#Agriculture]]></category>
		<category><![CDATA[#AgricultureDevelopment]]></category>
		<category><![CDATA[#AgricultureDirector]]></category>
		<category><![CDATA[#B.GopiIAS]]></category>
		<category><![CDATA[#CleanEnergyHub]]></category>
		<category><![CDATA[#CleanEnergyManufacturingHub]]></category>
		<category><![CDATA[#Crop]]></category>
		<category><![CDATA[#CropDiversification]]></category>
		<category><![CDATA[#Dr.B.GopiIAS]]></category>
		<category><![CDATA[#Farmers]]></category>
		<category><![CDATA[#FarmersWelfare]]></category>
		<category><![CDATA[#FPOs]]></category>
		<category><![CDATA[#HICC]]></category>
		<category><![CDATA[#HITEX]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#IndiaEnergyExpo2026]]></category>
		<category><![CDATA[#IndiaEnergySummit&Expo-2026]]></category>
		<category><![CDATA[#Monocropping]]></category>
		<category><![CDATA[#MonocroppingPattern]]></category>
		<category><![CDATA[#PACS]]></category>
		<category><![CDATA[#Power]]></category>
		<category><![CDATA[#Solar]]></category>
		<category><![CDATA[#Solarisation]]></category>
		<category><![CDATA[#SolarPower]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TelanganaAgricultureDepartment]]></category>
		<category><![CDATA[#TelanganaAgricultureDirector]]></category>
		<category><![CDATA[#TelanganaDevelopment]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TelanganaStateAgricultureDepartment]]></category>
		<category><![CDATA[#TelanganaStateAgricultureDirector]]></category>
		<category><![CDATA[#Water]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=2294</guid>

					<description><![CDATA[<p>VGన్యూస్: వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని, తద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ వంటి చర్యలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి ఐఏఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా ఎనర్జీ సమ్మిట్ &#38; ఎక్స్‌పో–2026 లో భాగంగా బుధవారం నిర్వహించిన గ్రామీణ భారతదేశానికి విద్యుత్ పునరుత్పాదక ఇంధనం, విశ్వసనీయ విద్యుత్ మరియు సమ్మిళిత అభివృద్ధి అంశంపై జరిగిన [&#8230;]</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/dr-gopi-said-that-farmers-should-be-transformed-into-electricity-producers/">రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దాలి: డా. గోపి</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని, తద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ వంటి చర్యలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి ఐఏఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా ఎనర్జీ సమ్మిట్ &amp; ఎక్స్‌పో–2026 లో భాగంగా బుధవారం నిర్వహించిన గ్రామీణ భారతదేశానికి విద్యుత్ పునరుత్పాదక ఇంధనం, విశ్వసనీయ విద్యుత్ మరియు సమ్మిళిత అభివృద్ధి అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో డా. బి. గోపి ఐఏఎస్ పాల్గొన్నారు.<br />
ఈ సందర్భంగా గోపి ఐఏఎస్ మాట్లాడుతూ.. వివిధ పంటలకు నీటి అవసరం భిన్నంగా ఉంటుందని, తద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవసరమయ్యే విద్యుత్ వినియోగం కూడా పంటను బట్టి మారుతుందని తెలిపారు. ప్రస్తుతం అధికంగా ఒకే రకమైన పంట విధానం (Monocropping Pattern)వైపు వ్యవసాయం సాగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంటల వైవిధ్యీకరణను (Crop Diversification) ప్రధాన ప్రాధాన్యతగా తీసుకుందని తెలిపారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. తక్కువ నీటి అవసరమున్న, రైతులకు లాభదాయకమైన పంటలను ప్రోత్సహించడం ద్వారా నీటిపై, వ్యవసాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని వివరించారు.<br />
వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించే దిశగా వ్యవసాయ రంగంలో సౌర విద్యుదీకరణ (Solarisation)ను విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని డా. గోపి అన్నారు. రైతులు కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా, భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తిదారులుగా కూడా మారేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా అవసరమైన మూలధన పెట్టుబడికి సహకారం అందించడంతో పాటు, రైతులకు అనుకూలమైన విధానాలను రూపొందించి సమర్థవంతమైన వ్యవస్థను ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) వంటి సంస్థలను సౌర విద్యుదీకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా రైతులే విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేయవచ్చని డా. గోపి పేర్కొన్నారు.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/dr-gopi-said-that-farmers-should-be-transformed-into-electricity-producers/">రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దాలి: డా. గోపి</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అరుదైన గుర్తింపు</title>
		<link>https://vgnews.net/gachibowli-hockey-stadium-receives-key-recognition/</link>
		
		<dc:creator><![CDATA[VG News]]></dc:creator>
		<pubDate>Wed, 19 Aug 2026 18:47:31 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[క్రీడలు & సినిమా]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#FIH]]></category>
		<category><![CDATA[#FIH-1Recognition]]></category>
		<category><![CDATA[#GachibowliHockeyStadium]]></category>
		<category><![CDATA[#GachibowliStadium]]></category>
		<category><![CDATA[#HockeyStadium]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#InternationalHockeyFederation]]></category>
		<category><![CDATA[#InternationalHockeyFederation(FIH)]]></category>
		<category><![CDATA[#NationalNews]]></category>
		<category><![CDATA[#SportsNews]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TelanganaDevelopment]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TelanganaSportsAuthority]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=2289</guid>

					<description><![CDATA[<p>VGన్యూస్: గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రతిష్ఠాత్మక కేటగిరీ–1 హాకీ ఫీల్డ్ ధ్రువీకరణ లభించింది. ఈ ధృవీకరణతో దేశంలోనే మొట్టమొదటి మరియు ఒకే ఒక్క క్యాటగిరి 1 ఆస్ట్రేటర్ఫ్ హాకీ మైదానంగా గచ్చిబౌలి హాకీ స్టేడియం నిలిచింది. అత్యున్నత స్థాయి అంతర్జాతీయ, ఫీల్డ్ పరీక్షల్లో మైదానం నాణ్యత, బంతి కదలిక, ఉపరితల సమతుల్యత, మైదానం కొలతలు, లైన్ మార్కింగ్‌లు, నీటి పారుదల, ఆటగాళ్ల భద్రత, హాకీ గోల్స్, జట్లు–అధికారుల సదుపాయాలు, పరిధి [&#8230;]</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/gachibowli-hockey-stadium-receives-key-recognition/">గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అరుదైన గుర్తింపు</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రతిష్ఠాత్మక కేటగిరీ–1 హాకీ ఫీల్డ్ ధ్రువీకరణ లభించింది. ఈ ధృవీకరణతో దేశంలోనే మొట్టమొదటి మరియు ఒకే ఒక్క క్యాటగిరి 1 ఆస్ట్రేటర్ఫ్ హాకీ మైదానంగా గచ్చిబౌలి హాకీ స్టేడియం నిలిచింది. అత్యున్నత స్థాయి అంతర్జాతీయ, ఫీల్డ్ పరీక్షల్లో మైదానం నాణ్యత, బంతి కదలిక, ఉపరితల సమతుల్యత, మైదానం కొలతలు, లైన్ మార్కింగ్‌లు, నీటి పారుదల, ఆటగాళ్ల భద్రత, హాకీ గోల్స్, జట్లు–అధికారుల సదుపాయాలు, పరిధి కంచె, ప్రేక్షకుల వసతులు, అంతర్జాతీయ పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఎఫ్‌ఐహెచ్ పరిశీలించింది. ఇవన్నీ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించింది.<br />
అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు అత్యంత కీలకమైన ఫీల్డ్ లైటింగ్‌ను కూడా ఎఫ్‌ఐహెచ్(International Hockey Federation) ప్రత్యేకంగా పరీక్షించింది. కేటగిరీ–1 మైదానానికి అవసరమైన TV3 స్థాయి లైటింగ్ ప్రమాణాలను గచ్చిబౌలి స్టేడియం అందుకుంటున్నట్లు నిర్ధారించింది. ఈ ధ్రువీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు అమల్లో ఉంటుంది. దీంతో గచ్చిబౌలి హాకీ స్టేడియం అంతర్జాతీయ స్థాయి హాకీ పోటీల నిర్వహణకు మరో కీలక గుర్తింపు పొందింది. ఇటీవల మార్చి 8 నుంచి 13 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ మహిళల హాకీ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల నేపథ్యంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు సమన్వయంతో నిరంతరం కృషి చేసి, రికార్డు సమయంలో మైదానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ కృషికి లభించిన ఎఫ్‌ఐహెచ్ కేటగిరీ–1 ధ్రువీకరణ గచ్చిబౌలి స్టేడియం సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/gachibowli-hockey-stadium-receives-key-recognition/">గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అరుదైన గుర్తింపు</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది: సీఎం</title>
		<link>https://vgnews.net/cm-revanth-reddy-stated-that-the-government-would-take-the-responsibility-of-safeguarding-the-livelihood-of-toddy-tappers/</link>
		
		<dc:creator><![CDATA[VG News]]></dc:creator>
		<pubDate>Tue, 18 Aug 2026 19:50:43 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#BCWelfare]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDY]]></category>
		<category><![CDATA[#GoudCommunity]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#MalluBhattiVikrarka]]></category>
		<category><![CDATA[#PandugaSayanna]]></category>
		<category><![CDATA[#PoliticalNews]]></category>
		<category><![CDATA[#PonnamPrbhakar]]></category>
		<category><![CDATA[#Revanthreddy]]></category>
		<category><![CDATA[#SardarSarvaiPapannaGoud]]></category>
		<category><![CDATA[#SardarSarvaiPapannaGoudBirthAnniversaryCelebrations]]></category>
		<category><![CDATA[#SardarSarvaiPapannaGoudJayanthiCelebrations]]></category>
		<category><![CDATA[#SarvaiPapanna]]></category>
		<category><![CDATA[#SarvaiPapannaStatue]]></category>
		<category><![CDATA[#SocialJustice]]></category>
		<category><![CDATA[#Tankbund]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<category><![CDATA[#ToddyTappers]]></category>
		<category><![CDATA[#WeaversCommunity]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=2286</guid>

					<description><![CDATA[<p>VGన్యూస్: రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు [&#8230;]</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/cm-revanth-reddy-stated-that-the-government-would-take-the-responsibility-of-safeguarding-the-livelihood-of-toddy-tappers/">గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది: సీఎం</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను అని గుర్తుచేశారు. గౌడ సోదరులకు 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశాం. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నాం” అని చెప్పారు.<br />
గీత కార్మికుల వృత్తిని కాపాడటానికి నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపైన ఈత, తాటి చెట్లను నాటాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ట్యాంక్ బండ్ మీద ఉన్న పర్యాటక శాఖ కార్యాలయాన్ని మరోచోటికి తరలించి ఆ స్థలంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ సందర్శనకు వచ్చే పర్యాటకులు, గణేష్ నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్ నుంచి ఎవరు వెళ్లినా ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కులవృత్తిని కొనసాగించండి. గౌరవించండి. కానీ పిల్లలను మాత్రం చదివించండి. పిల్లల తలరాతలను మార్చే శక్తి మన చేతుల్లో ఉంది. పిల్లలను చదివించి వారు ఉన్నతస్థానానికి చేరుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలి అని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందన్నారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో బీసీ కులగణన చేశాం. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.</p>
<p><span style="color: #0000ff;"><strong>అధికారికంగా పండుగ సాయన్న జయంతి :</strong></span><br />
దొరలు, భూస్వాములు, పెత్తందార్లపై పోరాటం సాగించిన యోధుడు, ముదిరాజ్‌ల ఆరాధ్యదైవం పండుగ సాయన్న అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసన్నారు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/cm-revanth-reddy-stated-that-the-government-would-take-the-responsibility-of-safeguarding-the-livelihood-of-toddy-tappers/">గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది: సీఎం</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంది: సీఎం</title>
		<link>https://vgnews.net/cm-revanth-reddy-stated-that-the-government-is-committed-to-protecting-the-property-rights-of-the-people/</link>
		
		<dc:creator><![CDATA[VG News]]></dc:creator>
		<pubDate>Tue, 18 Aug 2026 19:24:38 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#22AProperties]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDY]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#LandRecords]]></category>
		<category><![CDATA[#LandRegistration]]></category>
		<category><![CDATA[#PoliticalNews]]></category>
		<category><![CDATA[#PonguletiSrinivasaReddy]]></category>
		<category><![CDATA[#PrajaPalana]]></category>
		<category><![CDATA[#PropertyRegistration]]></category>
		<category><![CDATA[#PropertyRights]]></category>
		<category><![CDATA[#Revanthreddy]]></category>
		<category><![CDATA[#RevenueDepartment]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TelanganaDevelopment]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TelanganaRising2047]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=2284</guid>

					<description><![CDATA[<p>VGన్యూస్: ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. మంగళవారం 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేష‌న్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేష‌న్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ [&#8230;]</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/cm-revanth-reddy-stated-that-the-government-is-committed-to-protecting-the-property-rights-of-the-people/">ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంది: సీఎం</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. మంగళవారం 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేష‌న్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేష‌న్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో ప‌రిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేష‌న్ వెంట‌నే చేయాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లా క‌లెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్ణంగా ప‌రిశీలించి, శాశ్వత ప‌రిష్కారానికి స‌రైన జాబితాను రూపొందించాలన్నారు. అందులో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూడాల‌ని.. ఈ ప్రక్రియ‌ను త్వర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు.<br />
ప్రజ‌లు త‌మ భూ హ‌క్కుల విష‌యంలో ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందన్నారు. ప్రైవేటు భూముల‌కు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమన్నారు. 22-ఏ భూముల విష‌యంలో ద‌ళారులు, మ‌ధ్యవ‌ర్తుల‌ను ఆశ్రయించ‌వ‌ద్దని సూచించారు. ఎటువంటి పుకార్లు, క‌ట్టు క‌థ‌ల‌ను విశ్వసించ‌వ‌ద్దని చెప్పారు.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/cm-revanth-reddy-stated-that-the-government-is-committed-to-protecting-the-property-rights-of-the-people/">ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంది: సీఎం</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>RGPRS తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్‌గా రాజేంద్ర ప్రసాద్ యాదవ్</title>
		<link>https://vgnews.net/rajendra-prasad-yadav-appointed-as-rgprs-telangana-state-chairman/</link>
		
		<dc:creator><![CDATA[VG News]]></dc:creator>
		<pubDate>Tue, 18 Aug 2026 19:12:15 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#AICC]]></category>
		<category><![CDATA[#CongressParty]]></category>
		<category><![CDATA[#MarkaRajendraPrasadYadav]]></category>
		<category><![CDATA[#PoliticalNews]]></category>
		<category><![CDATA[#RGPRSStateChairman]]></category>
		<category><![CDATA[#RGPRSStateChairperson]]></category>
		<category><![CDATA[#RGPRSTelanganaChairman]]></category>
		<category><![CDATA[#RGPRSTelanganaChairperson]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TelanganaCongress]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=2281</guid>

					<description><![CDATA[<p>VGన్యూస్: తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS) రాష్ట్ర ఛైర్మన్‌గా మార్క రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/rajendra-prasad-yadav-appointed-as-rgprs-telangana-state-chairman/">RGPRS తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్‌గా రాజేంద్ర ప్రసాద్ యాదవ్</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS) రాష్ట్ర ఛైర్మన్‌గా మార్క రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/rajendra-prasad-yadav-appointed-as-rgprs-telangana-state-chairman/">RGPRS తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్‌గా రాజేంద్ర ప్రసాద్ యాదవ్</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>స్థానిక సంస్థలు బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి నారా లోకేష్</title>
		<link>https://vgnews.net/minister-nara-lokesh-said-that-this-is-another-step-forward-in-strengthening-local-bodies/</link>
		
		<dc:creator><![CDATA[VG News]]></dc:creator>
		<pubDate>Tue, 18 Aug 2026 18:59:08 +0000</pubDate>
				<category><![CDATA[జాతీయం & అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[ఎన్నికలు]]></category>
		<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#APAssembly]]></category>
		<category><![CDATA[#APBCReservation]]></category>
		<category><![CDATA[#APCabinetMeeting]]></category>
		<category><![CDATA[#APGovernment]]></category>
		<category><![CDATA[#APLocalBodiesElection]]></category>
		<category><![CDATA[#BCRESERVATION]]></category>
		<category><![CDATA[#LocalBodiesElection]]></category>
		<category><![CDATA[#MinisterNaraLokesh]]></category>
		<category><![CDATA[#NaraLokesh]]></category>
		<category><![CDATA[#PoliticalNews]]></category>
		<category><![CDATA[#TDP]]></category>
		<category><![CDATA[#TDPWithBCs]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=2278</guid>

					<description><![CDATA[<p>VGన్యూస్: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల‌కు వెన్నూద‌న్నుగా నిలుస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఏపీ మంత్రిమండ‌లి తీసుకున్న మ‌రో చారిత్రక నిర్ణయం బీసీల‌కు రాజ‌కీయ సాధికార‌త‌కు గొప్ప అవ‌కాశం కానుందన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో (RLBs) బీసీలకు 34 శాతం , పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం బీసీలకు జై కొట్టింది.. జ‌య‌హో బీసీ అంటోందన్నారు. [&#8230;]</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/minister-nara-lokesh-said-that-this-is-another-step-forward-in-strengthening-local-bodies/">స్థానిక సంస్థలు బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి నారా లోకేష్</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల‌కు వెన్నూద‌న్నుగా నిలుస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఏపీ మంత్రిమండ‌లి తీసుకున్న మ‌రో చారిత్రక నిర్ణయం బీసీల‌కు రాజ‌కీయ సాధికార‌త‌కు గొప్ప అవ‌కాశం కానుందన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో (RLBs) బీసీలకు 34 శాతం , పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం బీసీలకు జై కొట్టింది.. జ‌య‌హో బీసీ అంటోందన్నారు.<br />
ఏపీ పంచాయ‌తీరాజ్ చట్టం 1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకోవ‌డం కీలకమైన అంశమన్నారు. నగర, పట్టణ, నగర పంచాయ‌తీల్లోని మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టాలని, 13 జెడ్పీలను 28 జిల్లాపరిషత్ లు గా ఏర్పాటు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాల‌తో స్థానిక సంస్థల బ‌లోపేతం, పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌కు గొప్ప ముంద‌డుగు ప‌డిందని మంత్రి లోకేష్ అన్నారు.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/minister-nara-lokesh-said-that-this-is-another-step-forward-in-strengthening-local-bodies/">స్థానిక సంస్థలు బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి నారా లోకేష్</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు</title>
		<link>https://vgnews.net/sarvai-papannas-birth-anniversary-celebrations-held-on-a-grand-scale/</link>
		
		<dc:creator><![CDATA[VG News]]></dc:creator>
		<pubDate>Tue, 18 Aug 2026 18:41:34 +0000</pubDate>
				<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[#BirthAnniversaryCelebrations]]></category>
		<category><![CDATA[#JayanthiCelebrations]]></category>
		<category><![CDATA[#Kothagudem]]></category>
		<category><![CDATA[#KothagudemNews]]></category>
		<category><![CDATA[#SardarSarvaiPapannaGoud]]></category>
		<category><![CDATA[#SardarSarvaiPapannaGoudBirthAnniversaryCelebrations]]></category>
		<category><![CDATA[#SardarSarvaiPapannaGoudJayanthi]]></category>
		<category><![CDATA[#SardarSarvaiPapannaGoudJayanthiCelebrations]]></category>
		<category><![CDATA[#SarvaiPapannaGoud]]></category>
		<category><![CDATA[#SarvaiPapannaGoudBirthAnniversaryCelebrations]]></category>
		<category><![CDATA[#Suryapet]]></category>
		<category><![CDATA[#SuryapetDistrictNews]]></category>
		<category><![CDATA[#Thungathurthy]]></category>
		<category><![CDATA[#ThungathurthyNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=2275</guid>

					<description><![CDATA[<p>VGన్యూస్: తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వర్దేల్లి లింగయ్య గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులంలో పుట్టి పేద ప్రజల తరఫున పోరాడిన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. మొగల్ సామ్రాజ్య రాజులను ఎదిరించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని బహుజన రాజ్యాన్ని స్థాపించిన వీరుడని తెలిపారు.ఈ కార్యక్రమంలో వగలగాని [&#8230;]</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/sarvai-papannas-birth-anniversary-celebrations-held-on-a-grand-scale/">ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వర్దేల్లి లింగయ్య గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులంలో పుట్టి పేద ప్రజల తరఫున పోరాడిన పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. మొగల్ సామ్రాజ్య రాజులను ఎదిరించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని బహుజన రాజ్యాన్ని స్థాపించిన వీరుడని తెలిపారు.ఈ కార్యక్రమంలో వగలగాని వెంకన్న, వగలగాని వీరయ్య, వర్దేల్లి సత్యనారాయణ, గుండగాని సందీప్, వర్దేల్లి వీరభద్రం, రాము, వెంకన్న, హరీష్, తదితరులు పాల్గొన్నారు.</p>
<p>&lt;p&gt;The post <a rel="nofollow" href="https://vgnews.net/sarvai-papannas-birth-anniversary-celebrations-held-on-a-grand-scale/">ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు</a> first appeared on <a rel="nofollow" href="https://vgnews.net">vgnews.net</a>.&lt;/p&gt;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
