<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>vgnews.net</title>
	<atom:link href="https://vgnews.net/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vgnews.net</link>
	<description></description>
	<lastBuildDate>Sat, 11 Jul 2026 08:38:06 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://vgnews.net/wp-content/uploads/2025/02/vg-news-fevicon.png</url>
	<title>vgnews.net</title>
	<link>https://vgnews.net</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>జనాభా అనేది లెక్క కాదు.. ఆ దేశ భవిష్యత్తు: మధుబాబు చికిలే</title>
		<link>https://vgnews.net/world-human-rights-council-national-director-madhu-babu-chikile-stated-that-population-is-not-merely-a-statistic-but-the-future-of-a-country/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Sat, 11 Jul 2026 08:38:06 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#MadhuBabuChikile]]></category>
		<category><![CDATA[#NationalDirector]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<category><![CDATA[#WorldHumanRightsCouncil]]></category>
		<category><![CDATA[#WorldPopulationDay]]></category>
		<category><![CDATA[#WorldPopulationDay2026]]></category>
		<category><![CDATA[#WorldPopulationDayNews]]></category>
		<category><![CDATA[#WorldPopulationDayNews2026]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1970</guid>

					<description><![CDATA[VGన్యూస్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో గిరినగర్ డివిజన్ లోని శ్రీసాయి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ.. జనాభా అనేది లెక్క కాదు.. అది ఆ దేశ భవిష్యత్తు అని అన్నారు. మానవ వనరులను నైపుణ్య వనరులుగా మార్చుకుంటే జనం, దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో జనాభా విస్ఫోటనం [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో గిరినగర్ డివిజన్ లోని శ్రీసాయి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ.. జనాభా అనేది లెక్క కాదు.. అది ఆ దేశ భవిష్యత్తు అని అన్నారు. మానవ వనరులను నైపుణ్య వనరులుగా మార్చుకుంటే జనం, దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో జనాభా విస్ఫోటనం ప్రధాన సమస్యగా భావించబడింది.. అయితే ఇప్పుడు అనేక దేశాల్లో తక్కువ జననాల రేటు, వృద్ధుల జనాభా పెరుగుదల, కార్మికుల కొరత వంటి కొత్త సవాళ్లు కనిపిస్తున్నాయని అన్నారు.                                                                                                                             ఒకవైపు కొన్ని దేశాలు జననాలను ప్రోత్సహించే విధానాలు చేపడుతుండగా, మరోవైపు కొన్ని దేశాలు తమ జనాభా నిర్మాణాన్ని సమతుల్యం చేయడానికి కృషి చేస్తున్నాయని మధుబాబు పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశాలలో ఒకటి.. భారత్ కు ఉన్న యువశక్తిని నైపుణ్యంగా, ఆరోగ్యంగా, ఉత్పాదకంగా తీర్చిదిద్దితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే విధానంతో ప్రజలు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ వ్యవస్థాపకులు తూటే విజయ్ కుమార్, పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ కట్టె, సందీప్ బల్లెం, చైతన్య బల్లెం, ఆనంద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>నాగర్‌కర్నూల్ నూతన బస్ స్టేషన్‌కు శంకుస్థాపన</title>
		<link>https://vgnews.net/ministers-ponnam-prabhakar-and-jupally-krishna-rao-laid-the-foundation-stone-for-the-new-nagarkurnool-bus-station/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Wed, 08 Jul 2026 18:18:57 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#FoundationStone]]></category>
		<category><![CDATA[#MinisterJupallyKrishnaRao]]></category>
		<category><![CDATA[#MinisterJupallyKrishnaRaoNews]]></category>
		<category><![CDATA[#MINISTERPONNAMPRABHAKAR]]></category>
		<category><![CDATA[#MinisterPonnamPrabhakarNews]]></category>
		<category><![CDATA[#Nagarkurnool]]></category>
		<category><![CDATA[#NagarkurnoolBusStation]]></category>
		<category><![CDATA[#NagarkurnoolNews]]></category>
		<category><![CDATA[#PrajaPalana]]></category>
		<category><![CDATA[#PrajaPrabhutvam]]></category>
		<category><![CDATA[#PrajaPrabhutwam]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TelanganaRising2047]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<category><![CDATA[#TGSRTC]]></category>
		<category><![CDATA[#TGSRTCNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1966</guid>

					<description><![CDATA[VGన్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్ స్టేషన్‌కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నాగర్‌కర్నూల్ నుంచి వనపర్తి వరకు కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్ స్టేషన్‌కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నాగర్‌కర్నూల్ నుంచి వనపర్తి వరకు కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి, అక్కడి వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని దేదీప్యమానంగా నిర్వహించాలి: మంత్రి సురేఖ</title>
		<link>https://vgnews.net/minister-konda-surekha-directed-officials-to-conduct-the-kalyana-utsavam-of-goddess-balkampet-yellamma-in-a-grand-and-resplendent-manner/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Wed, 08 Jul 2026 18:07:55 +0000</pubDate>
				<category><![CDATA[ఆధ్యాత్మికం]]></category>
		<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#BalkampetYellammaTemple]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#KalyanaUtsavam]]></category>
		<category><![CDATA[#KondaSurekha]]></category>
		<category><![CDATA[#MinisterKondaSurekha]]></category>
		<category><![CDATA[#MinisterKondaSurekhaNews]]></category>
		<category><![CDATA[#PrajaPalana]]></category>
		<category><![CDATA[#PrajaPrabhutvam]]></category>
		<category><![CDATA[#PrajaPrabhutwam]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1963</guid>

					<description><![CDATA[VGన్యూస్: ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా, కన్నుల పండువగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎల్లమ్మ అమ్మవారు బల్కంపేటలో కొలువై వుండటం తెలంగాణ రాష్ట్రానికి మంగళప్రదం అని మంత్రి అన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవ సమన్వయ సమావేశంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా, కన్నుల పండువగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎల్లమ్మ అమ్మవారు బల్కంపేటలో కొలువై వుండటం తెలంగాణ రాష్ట్రానికి మంగళప్రదం అని మంత్రి అన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవ సమన్వయ సమావేశంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ అమ్మవారి దర్శనం చేసుకుని, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో సాగిన ఈ సమావేశంలో ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పై వివిధ శాఖలకు అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.<br />
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. బల్కంపేట దేవస్థానంలో ఈ నెల 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఎదుర్కోలు ఉత్సవంతో వార్షిక కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయని, 21వ తేదీన ఉదయం 9 గంటలకు అత్యంత వైభవంగా అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారని, 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఐ&amp;పీఆర్ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, అడిషనల్ సీపీ ఇక్బాల్, సాంస్కృతిక శాఖ డైరక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, ఆర్&amp;బీ, దేవాదాయ, టీజీఎస్పీడీసీఎల్, జిహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖ తదితర శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>తెలంగాణ ప్రతినిధి బృందాన్ని కెనడాకు ఆహ్వానించిన క్రిస్ కూటర్</title>
		<link>https://vgnews.net/canadian-high-commissioner-to-india-chris-cooter-invited-a-telangana-delegation-to-canada/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Wed, 08 Jul 2026 17:43:27 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#Canada]]></category>
		<category><![CDATA[#CanadaIndiaRelations]]></category>
		<category><![CDATA[#CanadaTelangana]]></category>
		<category><![CDATA[#ChrisCooter]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDY]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#InvestInTelangana]]></category>
		<category><![CDATA[#PrajaPalana]]></category>
		<category><![CDATA[#PrajaPrabhutvam]]></category>
		<category><![CDATA[#PrajaPrabhutwam]]></category>
		<category><![CDATA[#Revanthreddy]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TelanganaRising2047]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1960</guid>

					<description><![CDATA[VGన్యూస్: భారత్‌లోని కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సుస్థిర అభివృద్ధి వంటి పలు కీలక రంగాల్లో కెనడా–తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. కెనడా- తెలంగాణ మధ్య వేగంగా విస్తరిస్తున్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి దోహదపడే అనేక రంగాల్లో పరస్పర సహకరించుకునే అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా క్రిస్ కూటర్ ముఖ్యమంత్రి నేతృత్వంలోని [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: భారత్‌లోని కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సుస్థిర అభివృద్ధి వంటి పలు కీలక రంగాల్లో కెనడా–తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. కెనడా- తెలంగాణ మధ్య వేగంగా విస్తరిస్తున్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధికి దోహదపడే అనేక రంగాల్లో పరస్పర సహకరించుకునే అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా క్రిస్ కూటర్ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కెనడా పర్యటనకు ఆహ్వానించారు. ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా రంగాల మధ్య మరింత బలమైన భాగస్వామ్యం కోసం కెనడాలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు.<br />
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ వంటి మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి అంశాలను ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుల్లో కెనడా సాంకేతిక నైపుణ్యం, పెట్టుబడులు, భాగస్వామ్యానికి విశేష అవకాశాలు ఉన్నాయని హై కమిషనర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణపై కెనడియన్ సంస్థలకు పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా, ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, సీఐబీసీ (CIBC) తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను ప్రారంభించడం, అలాగే CPP Investments హైదరాబాద్‌కు చెందిన CtrlS Datacenters తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక బిలియన్ కెనడియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు కట్టుబడి ఉండడం వంటి పరిణామాలను కూటర్ ప్రస్తావించారు.<br />
రాష్ట్రంలో హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి లక్ష్యాల సాధనలో కెనడా సహకారాన్ని సీఎం కోరారు. అలాగే కెనడాకు చెందిన పలు విశ్వవిద్యాలయాలు కలిసి హైదరాబాద్‌లో ఒక మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని కూటర్ హామీ ఇచ్చారు. రానున్న నెలల్లో కెనడియన్ వాణిజ్య ప్రతినిధి బృందం తెలంగాణను సందర్శించి ఇంధనం, పట్టణాభివృద్ధి, రక్షణ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, ఐటీఈ&amp;సీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>సీఎంతో అంతర్జాతీయ ప్రతినిధి బృందం భేటీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ</title>
		<link>https://vgnews.net/an-international-delegation-met-with-cm-revanth-reddy-during-the-meeting-they-discussed-investments-in-telangana/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Wed, 08 Jul 2026 16:44:02 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#ClimateAction]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDY]]></category>
		<category><![CDATA[#GlobalPartnerships]]></category>
		<category><![CDATA[#GreenGrowthEconomicSummit2026]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#PrajaPalana]]></category>
		<category><![CDATA[#PrajaPrabhutvam]]></category>
		<category><![CDATA[#PrajaPrabhutwam]]></category>
		<category><![CDATA[#Revanthreddy]]></category>
		<category><![CDATA[#Sustainability]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TelanganaRising2047]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1957</guid>

					<description><![CDATA[VGన్యూస్: హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ -2026లో పాల్గొనడానికి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మలేషియా పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ ఎం. శరవణన్, అమెరికాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ బోర్డు డైరెక్టర్ నిలి గిల్బర్ట్, అమెరికా వాణిజ్య శాఖ మూమెంటమ్ టెక్నాలజీస్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మహేష్ కొండూరు, ఓక్సన్ టెక్నాలజీస్, గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ కో-చైర్ అమిత్ [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ -2026లో పాల్గొనడానికి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మలేషియా పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ ఎం. శరవణన్, అమెరికాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ బోర్డు డైరెక్టర్ నిలి గిల్బర్ట్, అమెరికా వాణిజ్య శాఖ మూమెంటమ్ టెక్నాలజీస్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మహేష్ కొండూరు, ఓక్సన్ టెక్నాలజీస్, గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ కో-చైర్ అమిత్ మెహ్రా, నార్వే ప్రభుత్వ మాజీ స్టేట్ సెక్రెటరీ, ఓషన్ హౌస్ గ్లోబల్ స్ట్రాటజీస్ సలహాదారు దిలెక్ అయహన్, దక్షిణాఫ్రికా పార్లమెంట్ సభ్యుడు థామస్ ప్రోలిక్, సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు సెంథిల్ తొండమాన్ సీఎంతో భేటీ అయ్యారు.<br />
ఈ ప్రతినిధి బృందంతో జరిగిన భేటీలో ప్రధానంగా పర్యావరణం, సామాజిక, పరిపాలనా పరమైన అంశాలతో పాటు మౌలిక సదుపాయాలు, ఏఐ వినియోగం, భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. అలాగే తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. ఈ సమావేశంలో గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ నిర్వహిస్తున్న మెరీడియన్ కలెక్టివ్ ప్రతినిధులు రిత్వికా భట్టాచార్య, ఉమా భట్టాచార్య, లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>సీఎంతో గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు భేటీ</title>
		<link>https://vgnews.net/representatives-of-godrej-agrovet-meet-cm-revanth-reddy/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Wed, 08 Jul 2026 15:54:13 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDY]]></category>
		<category><![CDATA[#Godrej]]></category>
		<category><![CDATA[#GodrejAgrovet]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#InvestInTelangana]]></category>
		<category><![CDATA[#Khammam]]></category>
		<category><![CDATA[#PalmOil]]></category>
		<category><![CDATA[#PrajaPalana]]></category>
		<category><![CDATA[#PrajaPrabhutvam]]></category>
		<category><![CDATA[#PrajaPrabhutwam]]></category>
		<category><![CDATA[#RakeshSwami]]></category>
		<category><![CDATA[#Revanthreddy]]></category>
		<category><![CDATA[#SaugataNiyogi]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TELANGANAGOVERNMENT]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TelanganaRising2047]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<category><![CDATA[#TGIIC]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1954</guid>

					<description><![CDATA[VGన్యూస్: తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్, ఆయిల్ పామ్ సాగు విస్తరణ తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో సీఎంతో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి భేటీ అయ్యారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఈ సందర్భంగా కంపెనీ [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్, ఆయిల్ పామ్ సాగు విస్తరణ తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో సీఎంతో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి భేటీ అయ్యారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ సాగు విస్తరణపై ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు నివేదికను అందించారు.<br />
ఖ‌మ్మం జిల్లాలో రూ. 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్టు ప్రతినిధులు వివరించారు. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, న‌ర్సరీ, పరిశోధన – అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజ‌ర్ల మండ‌లం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎక‌రాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎక‌రాల భూమిని కేటాయించాల‌ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ప్రాసెసింగ్ యూనిట్ కోసం రాహ‌దారిని విస్తరించాల‌ని ముఖ్యమంత్రిని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి టీజీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తర‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>నిరంజన్ ఇక లేడనే వార్త తీవ్రంగా కలచివేసింది: పవన్ కళ్యాణ్</title>
		<link>https://vgnews.net/ap-deputy-cm-pawan-kalyan-stated-that-the-news-of-his-fan-niranjans-passing-has-deeply-shaken-his-heart/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Wed, 08 Jul 2026 15:42:24 +0000</pubDate>
				<category><![CDATA[జాతీయం & అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#APDeputyCMPawanKalyan]]></category>
		<category><![CDATA[#DeputyCMPawankalyan]]></category>
		<category><![CDATA[#Niranjan]]></category>
		<category><![CDATA[#PawanKalyan]]></category>
		<category><![CDATA[#PawanKalyanFanNiranjan]]></category>
		<category><![CDATA[#PawanKalyanNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1950</guid>

					<description><![CDATA[VGన్యూస్: తన అభిమాని నిరంజన్ మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ &#8216;X&#8217; వేదికగా సంతాపం తెలిపారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందన్నారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. &#8220;కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: తన అభిమాని నిరంజన్ మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ &#8216;X&#8217; వేదికగా సంతాపం తెలిపారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందన్నారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.<br />
&#8220;కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను&#8221; అంటూ పవన్ కళ్యాణ్ &#8216;X&#8217; లో పోస్టు చేశారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి</title>
		<link>https://vgnews.net/cm-revanth-reddy-pays-tribute-to-y-s-rajasekhara-reddy/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Wed, 08 Jul 2026 15:23:30 +0000</pubDate>
				<category><![CDATA[జాతీయం & అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDY]]></category>
		<category><![CDATA[#KomatireddyVenkatReddy]]></category>
		<category><![CDATA[#Revanthreddy]]></category>
		<category><![CDATA[#Tributes]]></category>
		<category><![CDATA[#YSRajasekharaReddy]]></category>
		<category><![CDATA[#YSRJayanti]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1947</guid>

					<description><![CDATA[VGన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్సాఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, లోక్‌సభ సభ్యుడు కుందూరు రఘవీర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ నివాళులు అర్పించారు.]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్సాఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, లోక్‌సభ సభ్యుడు కుందూరు రఘవీర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ నివాళులు అర్పించారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>జనసేనలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సీతారామ్</title>
		<link>https://vgnews.net/badminton-player-gudipati-sitaram-joins-janasena-party/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Tue, 07 Jul 2026 19:58:15 +0000</pubDate>
				<category><![CDATA[జాతీయం & అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[#AndhraPradesh]]></category>
		<category><![CDATA[#AndhraPradeshNews]]></category>
		<category><![CDATA[#BadmintonPlayerGudipatiSitaram]]></category>
		<category><![CDATA[#DeputyCMPawankalyan]]></category>
		<category><![CDATA[#GudipatiSitaram]]></category>
		<category><![CDATA[#Janasena]]></category>
		<category><![CDATA[#JanasenaParty]]></category>
		<category><![CDATA[#Joining]]></category>
		<category><![CDATA[#PawanKalyan]]></category>
		<category><![CDATA[#PoliticalNews]]></category>
		<category><![CDATA[#SingerSrilalitha]]></category>
		<category><![CDATA[#TeluguNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1944</guid>

					<description><![CDATA[VGన్యూస్: విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. సీతారామ్ ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీతారామ్ సతీమణి, యువ గాయని శ్రీలలిత పాల్గొన్నారు.]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. సీతారామ్ ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీతారామ్ సతీమణి, యువ గాయని శ్రీలలిత పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి</title>
		<link>https://vgnews.net/chief-minister-revanth-reddy-watched-the-football-match-between-argentina-and-egypt-with-students-on-tuesday/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Tue, 07 Jul 2026 19:33:55 +0000</pubDate>
				<category><![CDATA[క్రీడలు & సినిమా]]></category>
		<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[విద్య-ఉద్యోగం]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#2026FIFAWorldCup]]></category>
		<category><![CDATA[#Argentina]]></category>
		<category><![CDATA[#AtlantaStadium]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDY]]></category>
		<category><![CDATA[#Egypt]]></category>
		<category><![CDATA[#FIFA]]></category>
		<category><![CDATA[#FIFAWorldCup]]></category>
		<category><![CDATA[#FIFAWorldCup2026]]></category>
		<category><![CDATA[#Football]]></category>
		<category><![CDATA[#HYDERABAD]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#LionelMessi]]></category>
		<category><![CDATA[#Revanthreddy]]></category>
		<category><![CDATA[#ShilpakalaVedika]]></category>
		<category><![CDATA[#SPORTS]]></category>
		<category><![CDATA[#SportsNews]]></category>
		<category><![CDATA[#Students]]></category>
		<category><![CDATA[#Telangana]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1941</guid>

					<description><![CDATA[VGన్యూస్: ఫీఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా అట్లాంటా స్టేడియంలో అర్జెంటినా, ఈజిప్ట్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్‌ను తిలకించారు. ఆద్యంతం విద్యార్థుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య వీక్షణ కార్యక్రమం కోలాహలంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటినా 3-2 గోల్స్‌ తేడాతో విజయం [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: ఫీఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా అట్లాంటా స్టేడియంలో అర్జెంటినా, ఈజిప్ట్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్‌ను తిలకించారు. ఆద్యంతం విద్యార్థుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య వీక్షణ కార్యక్రమం కోలాహలంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటినా 3-2 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
